రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 126 చోట్ల పోటీ చేయబోయే అభ్యర్ధుల జాబితాను తెలుగుదేశం పార్టీ గురువారం ప్రకటించింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లు ఉంటే 16 సీట్లకు తొలి జాబితాలోనే అభ్యర్ధులను ప్రకటించారు చంద్రబాబు. గుంటూరు జిల్లాలో 17కు గాను 14, క్రిష్ణా జిల్లాలో 16కు గాను 14 సీట్లను తొలి జాబితాలో చేర్చింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో 11 సీట్లకు, విశాఖపట్నంలో 11 సీట్లకు, ప్రకాశం జిల్లాలో 10 సీట్లకు, కర్నూలులో 9 సీట్లకు, శ్రీకాకుళంలో 9 సీట్లకు, చిత్తూరులో 8 సీట్లకు, కడపలో 7 సీట్లకు, విజయనగరంలో 6 సీట్లకు, నెల్లూరులో 6 సీట్లకు, అనంతపురంలో అతి తక్కువగా 5 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు చంద్రబాబు.
జిల్లాలవారీగా జాబితాలు చూడటానికి ఇమేజ్ పైన క్లిక్ చేయండి













You must be logged in to post a comment.