రూ. 50 వేలకు మించి డిపాజిట్ చేస్తారా.. ఒరిజినల్ ఐడీ తప్పనిసరి

admin
0 0
Read Time:1 Minute, 49 Second

మీరు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా? డిపాజిట్ చేసే మొత్తం రూ. 50,000కు మించి ఉంటే ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలి. ఇకపైన మీ గుర్తింపును నిర్ధారించే ఒరిజినల్ డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్ళాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన నిబంధన ఇది. మనీ లాండరింగ్ నిరోధక నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ శాఖ ఈమేరకు గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

అకౌంట్ ప్రారంభించేవారినుంచి, రూ. 50 వేలకు మించి లావాదేవీలు చేసేవారి నుంచి ఆధార్ నెంబర్, ఇతర అధికారిక పత్రాలు తీసుకోవడం బ్యాంకులకు తప్పనిసరి. స్టాక్ బ్రోకర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా ఈ నిబంధనలను పాటించాలి.

మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ), దానికి అనుబంధంగా వచ్చిన నిబంధనల ప్రకారం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఖాతాదారుల గుర్తింపును కచ్చితంగా వెరిఫై చేయాల్సి ఉంటుంది. రికార్డులను నిర్వహించి భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయు-ఇండ్) వంటి సంస్థలు కోరినప్పుడు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Next Post

కాబోయే సిఎం... రేవంత్ రెడ్డి కొడంగల్ సమావేశ స్వరమిది!

కార్యకర్తల నినాదాలు.. రేవంత్ ప్రసంగంలో నర్మగర్భ వ్యాఖ్యలు.. పత్రికా వార్తలన్నిటినీ ఖండిస్తున్నట్టు ప్రకటన.. నాయకుడి నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఉద్ఘాటన […]
error

Enjoy this blog? Please spread the word