అస్సాం ఫారెనర్స్ ట్రిబ్యునళ్ల గుడ్డి తీర్పులకు మరో ఉదాహరణ ఇది. బి.ఎస్.ఎఫ్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ముజిబుర్ రెహ్మాన్, ఆయన భార్య విదేశీయులని తేల్చింది ఆ రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణంలోని ట్రిబ్యునల్. రెహ్మాన్ ప్రస్తుతం బిఎస్ఎఫ్ లో పంజాబ్ రాష్ట్రంలో పని చేస్తున్నారు. జూలై చివరి వారంలో ఆయన సెలవుపై అస్సాం వచ్చినప్పుడు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.1923 నుంచి భూమి డాక్యుమెంట్లు ఉన్న తనలాంటి ఒక నిజమైన భారతీయుడిని ఓ తాగుబోతు సాక్ష్యం ఆధారంగా విదేశీయుడిగా ప్రకటించడం దారుణమని రెహ్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం పోలీసు శాఖలోని సరిహద్దు విభాగం ట్రిబ్యునల్ కు సమర్పించిన నివేదికకు ఓ తాగుబోతు వాంగ్మూలమే ఆధారమని రెహ్మాన్ చెబుతున్నారు. ఈ సరిహద్దు విభాగం ప్రధానంగా పాకిస్తాన్ నుంచి చొరబాట్లను నిరోధించడానికి 1962లో ఏర్పాటైంది. ఈ విభాగం ఆధారంగా అస్సాంలోని…
Read MoreDay: August 23, 2019
6.2 శాతమే : ఇండియా వృద్ధి రేటుపై ‘మూడీస్’
దేశంలో అనేక రంగాల్లో అమ్మకాలు క్షీణించాయని వార్తలు రోజూ వస్తున్న నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)పై షాకింగ్ వార్త. 2019 కేలండర్ సంవత్సరంలో భారత జీడీపీ కేవలం 6.2 శాతం పెరుగుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తాజా అంచనాలో పేర్కొంది. ఇంతకు ముందు తానే వేసిన అంచనా (6.8 శాతం) నుంచి గణనీయంగా తగ్గించడం గమనార్హం.2020 కేలండర్ సంవత్సరంలోనూ తన అంచనాను తగ్గించిన ‘మూడీస్’, వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండగలదని పేర్కొంది. బలహీనంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆసియా ఎగుమతులను ప్రభావితం చేసిందని, అనిశ్చిత వాతావరణంతో పెట్టుబడులు తగ్గిపోయాయని ‘మూడీస్’ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Read More