ఉత్తరాంధ్ర ప్రజలకు సిఎం సూచన ఈనెల 18-20మధ్య ఉత్తరాంధ్ర జిల్లాలకు తుపాను తాకిడి ఉంటుందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు సూచించారు. తుపాన్లు, పిడుగుల సమాచారాన్ని ప్రభుత్వం ముందుగానే ప్రజలకు చేరవేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ముఖ్యమంత్రి నీరు-ప్రగతి, వ్యవసాయంపై సమీక్ష సందర్భంగా తుపానుపై అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకళలాడాలని, ప్రతి రిజర్వాయర్ లో కనీస నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీశైలం కన్నా నాగార్జున సాగర్ లో నీటినిల్వ అధికంగా చేరడం శుభపరిణామమని, ఆ నీటిని సాగర్ ఆయకట్టుకు కుషన్ గా ఉంచుకోవాలని చెప్పారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 135టిఎంసిలు నిల్వ ఉంచితే రాష్ట్రానికి కొరత సమస్యే రాదన్నారు. సంకల్పం మంచిదైతే ఫలితాలు కూడా మంచిగా వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.…
Read More