కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యారంటీ అని అభయం మోడీ రెండు ఇండియాలను సృష్టిస్తున్నారని వ్యాఖ్య ‘‘ఆర్థికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు’’ అనే పాచికను ప్రయోగించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ఎత్తులు వేస్తున్నారు. దేశంలోని ‘‘ప్రతి పేదకూ కనీస ఆదాయం గ్యారంటీ’’గా కల్పిస్తామని ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ ఫలితం ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ నగరంలో జరిగిన ‘‘కిసాన్ ఆధార్ సమ్మేళన్’’లో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు. 15 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు చత్తీస్ గఢ్ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ…
Read More